విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన రెడ్డి శ్రీరాములు నాయుడు విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కమిషనర్ శ్రీరాములు నాయుడుకు అభినందనలు తెలిపారు.
నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన మీరు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలు మెచ్చే కమిషనర్గా మనల్ని పొందాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎమ్మెల్యే కోలగట్ల కు కృతజ్ఞతలు తెలియజేశారు.