సోమవారం ఉదయం ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో యువ తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబద్రుల శాసన మండలి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ప్రచారం చేశారు.
అనంతరం ఖమ్మo కలెక్టరేట్ ప్రాంగణం వద్ద మీడియా ప్రతినిధుల మాట్లాడుతూ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో వెంటనే ప్రభుత్వ, గిరిజన ,మైనింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చెయ్యాలని పేర్కోన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా చింతకాని కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తిగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా తేకపోవడం చాలా శోచనీయం అని అన్నారు.
కానీ ఈ ప్రాంతానికి యూనివర్సిటీ లేకుండా తన కు సొంత యూనివర్సిటీ తెచ్చుకున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రానైట్ ఇండస్ట్రీని ప్రాంతంలో అభివృద్ధి చేయాలని అన్నారు.. రాబోయే పట్టభద్రుల ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, పోరాడే వ్యక్తి గా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ,TPLA రాష్ట్ర అధ్యక్షుడు వంగపెల్లి రాజేశ్వేర్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీతలు రేoడ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు, యువ తెలంగాణ పార్టీ నాయకులు మురళి, కిషోర్, కల్యాణి,నీహారిక, దినేష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.