ఏపీ రాష్ట్ర పురపాలక, మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 22న ఉదయం విశాఖపట్నంలో బయలు దేరి 7.00 గంటలకు విజయనగరం లోని తన నివాసానికి చేరుకుంటారు. ఉ.9.30 విజయనగరంలో బయలుదేరి 10.00 గంటలకు రామతీర్థం చేరుకొని 10.08 గంటలకు రామతీర్థంలోని కొత్తగా నిర్మిస్తున్న కోదండ రామస్వామి గుడికి పునాది రాయ వేసి పూజచేస్తారు. 10.30 గంటలకు రామతీర్థంలో బయలుదేరి 11.00 గంటలకు విజయనగరంలో తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరంలో బయలుదేరి 3.00 గంటలకు ఎస్.కోట మండలం ఎస్.జి.పేట గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. 3.45 గంటలకు ఎస్.జి.పేటలో బయలుదేరి 4.00 గంటలకు కొత్తవలస మండలం దేవాడ గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు దేవాడ గ్రామంలో బయలు దేరి 5.30 గంటలకు విజయనగరంలో తన నివాసానికి చేరుకుంటారు.