ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం వెళ్ళే దారిలో ములుగు మండలం లోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలో గల గట్టమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఎం కెసిఆర్ కుటుంబం చల్లగా ఉండాలని, బిఆర్ఎస్ దేశంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించామన్నారు. ములుగు పరిసర ప్రాంతాల్లో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలను చూడాలని వాటి విశిష్టతలను మంత్రి అక్కడి ప్రజలకు వివరించారు
previous post