40.2 C
Hyderabad
May 6, 2024 17: 45 PM
Slider మెదక్

రేజింతల్ వినాయకుడికి మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా నేడు సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం, రేజింతల్ గ్రామంలో సిద్ది వినాయక దేవాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆలయ అధికారులు, పుజారులు ఆయన కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, టీఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసిఎంఎస్ ఛైర్మెన్ శివకుమార్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. స్వయంభూ వియకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభిృద్ధికి మరో రు. 50 లక్షలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Related posts

ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడిని ప్రతిఘటిస్తాం

Satyam NEWS

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలి

Bhavani

అపర తిరుపతి మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

Bhavani

Leave a Comment