అంబర్ పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బోనాల పండుగలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ నేడు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించింది. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి బి. వెంకట్ రెడ్డి ఈ మేరకు ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రికి అందచేశారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసిన ఆయన ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.
సత్యం న్యూస్, అంబర్పేట