దుండిగల్ పోలీస్ స్టేషన్ లో 446, 506 R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. సూరారంలో సర్వే నెంబర్ 115,116,117 లో 20 గుంటల భూమిని కబ్జా చేశారంటూ శ్యామలాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారంలో ఆస్పత్రికి అనుకొని ఉన్నభూమి అమ్మాలని బెదిరిస్తున్నట్టు బాధితురాలు శ్యామలదేవి వాపోయింది. ‘కోర్ట్ లో కేసు వేసిన లాయర్ ను కూడా తనవైపే తిప్పేసుకొని తెల్లకాగితంపై సంతకాలు తీసుకొని నకిలీ డాక్యూమెంట్లు సృష్టించార’ని పిర్యాదు చేసింది.
అంతేగాక ఆస్పత్రికి అనుకోని ఉన్న20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కూడా నిర్మించినట్టు మంత్రి మల్లారెడ్డిపై శ్యామలాదేవి ఫిర్యాదు చేసింది.