దేశ వ్యాప్తంగా వామ పక్ష పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు దాదాపు 24 పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.ఈ మేరకు విజయనగరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బందోబస్తును ఏర్పాటు చేసారు. ఆయా పార్టీల ధర్నా నేపథ్యంలో వారి వద్ద పోలీసులను మోహరించారు.