గత 15 సంవత్సరాలుగా వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్.సి. జివెలర్స్ అధినేత రమేష్ చంద్ర సంయుక్తంగా శ్రీరామ నవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం వనపర్తిలో 12 దేవాలయాలలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది. మొదటగా మంత్రి నిరంజన్ రెడ్డి వాసంతి దంపతుల చేతుల మీదుగా రాజానగరం దేవాలయం, అనంతరం జగతపల్లి ,నాగవరం, రమనగర్ కాలనీ రామాలయంలో , వెంకటేశ్వర దేవాలయం లో, కన్యకా పరమేశ్వరి దేవాలయంలో , బాలానగర్ లోని అభ య ఆంజనేయ స్వామి ఆలయం, ఇందిరా కాలనీ హనుమాన్ దేవాలయంలో, పీర్లగుట్ట హనుమాన్ దేవాలయం లో, మర్రి కుంట ఆంజనేయ స్వామి దేవాలయంలో, సాయి నగర్ కాలనీ రామాలయంలో ముత్యాల తలంబ్రాలు ఇచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పోచ రవీందర్ రెడ్డి , జగదీష్ ఉంగలం అలెక్య తిరుమల్, అలివేలు, గోపాల్, విజయ్ అలివెలమ్మ, వినోద్ గౌడ్, ఆవుల రమేష్ విశ్వనాథం, బాలేశ్వరయ్య, సునీల్ వాల్మీకి, రఘునాథ్ శర్మ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్