కొత్త క్యాబినెట్ మంత్రుల జాబితా ఈరోజు సాయంత్రం 7:00 గంటల తర్వాత విడుదల కానున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు.
సాయంత్రం 7 గంటల తర్వాత జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ జాబితా ప్రకారం 11వ తేది ఉ.11:31కి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులు ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో సజ్జల మాటలకు ప్రాధాన్యత పెరిగింది. 2024 ఎన్నికల లక్ష్యం తో సామాజిక వర్గ సమీకరణాలతో సిద్ధాం కానున్న జాబితా కాబట్టి తీవ్ర గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం.
చిన్న లీక్ కూడా లేకుండా అన్నీ జాగ్రత్తలు సీఎం జగన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తుది జాబితా విడుదలైన తర్వాత కొత్త మంత్రులకు సీఎం స్వయంగా ఫోన్ చేస్తారు. రాజ్ భవన్ కు పంపిన తుది జాబితాను మళ్లీ వెనక్కి తెప్పించడం కూడా సంచలనం కలిగించింది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు చేశారని సమాచారం. రాత్రి 7 గంటలకు తుది జాబితా రాజ్ భవన్ కు చేరే అవకాశం ఉంది.