పోలీసు శాఖలో పని చేసే అధికారులు,సిబ్బంది కొరకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీసులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులలో నిమగ్నమై ఉంటున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వారికోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లా పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని
కోరారు.గుండె,ఊపిరితిత్తులు,ఎముకలు,న్యూరాలజీ,కంటి చికిత్సలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత చికిత్సల కొరకు నిపుణులైన వైద్యులను పిలిపించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.ఇచ్చట వైద్య పరీక్షలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని పోలీసు శాఖ తరపున మెరుగైన చికిత్స చేయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి,పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ అతిధి గృహం నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరలోనే అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి, సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గోన్నారు.