సంతానం లేని వారిని కరుణించే తమిళనాడు లోని పుట్లూరు అమ్మన్ ఆలయంలో మంత్రి ఆర్ కె రోజా తన మేనకోడలు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. పిల్లలు లేని వారు ఈ అమ్మవారి ఆలయంలో వేడుకొంటే తప్పకుండా పిల్లలు పుడతారు. గర్భం దాల్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి సమక్షంలో సీమంతం చేసి మొక్కులు తీర్చుకొంటారు. మంత్రి రోజా కూడా అలాగే తన మేనకోడలు గర్భం దాల్చడంతో మొక్కు తీర్చడానికి ఇక్కడ సీమంతం జరిపారు. సంతానప్రాప్తి కలిగించే మహిమాన్విత “పుట్లూరు అమ్మ” వారి సేవకై మంత్రి రోజా ఆలయానికి రావడంతో అక్కడి స్థానికులలో సంతోషకర వాతావరణం నెలకొన్నది.