కని, పెంచిన అమ్మ, నాన్నల కన్నా…ఏ ట్యూషన్ లలోనో, స్కూళ్లలోనే కలుస్తున్న ప్రేమలకే విలువ నిస్తున్నారు…చాలామంది పిల్లలు. మనకు ఉజ్వల భవిష్యత్ ను ఇచ్చే అమ్మ, నాన్నల ప్రేమానురాగాలను తుంగలోకి నెట్టేస్తున్నారు.. నేటి యువతీయువకులు.
తాజాగా విద్యలనగరమైన విజయనగరం జిల్లాలో అదే జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ పదిహేడేళ్ల బాలిక….తాత్కాలిక ప్రేమ కోసం….గడప దాటింది…కాదు..కాదు..ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ ఇంటి నుంచీ వెళ్లిపోయింది.
టూటౌన్ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మేదర వీధికి చెందిన ఓ దంపతులకు 17 ఏళ్ల కూతురు ఉంది. నగరం సమీపంలో రామవరం ప్రభుత్వ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతోంది.
రోజూ స్కూలుకు వెళ్లడం..సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తూ ఉండేది. రోజూలానే ఈ నెల 25 న ఆ బాలిక ఉదయం తొమ్మిందికి స్కూలుకని బయలు దేరింది… నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ…చెప్పింది. అయితే కూతురు చెప్పిన మాటలను చాలా తేలికగా తీసుకున్నారు…అమ్మ,నాన్నలు.
అయితే రోజూ లానే సాయంత్రం అయినా,చీకటి పడుతున్న కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో కన్నవాళ్లలో ఆందోళన మొదలైంది. తక్షణం..ఆమె దగ్గరున్న ఫోన్ నెంబర్ కుకాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది.దీంతో కన్నవాళ్లలోఆందోళన మొదలైంది.
తన బిడ్డ పొద్దున్నే స్కూలుకు వెళ్లి మరి కనిపించడం లేదంటూ బాలిక తల్లి టూటన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాసరావు 86/21 u/s 363 కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.కన్నవాళ్లు చెప్పిన మాటలు,ఆనవాళ్ల ప్రకారం…బాలిక ఆచూకీ కోసం విశాఖకు బయలు దేరింది…పోలీసు బృందం. ఏదైనా…ఇటీవలే…గుర్ల పీఎస్ పరిధిలో రమ అనే విద్యార్ధిని కేసు వ్యవహారంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరరం ఎంతైనా ఉందనే చెప్పాలి.