బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకాకుళం సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, సి. ఆర్ . పి . లు చేపట్టారు.
దీనిలో భాగంగా గురువారం ఉదయం శ్రీకాకుళం గ్రామీణ మండలంలో బడి మానేసి విద్యార్థుల వివరాలను సేకరించి తిరిగి వారిని తిరిగి బడిలో చేర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం మండలం విద్యాశాఖాధికారి జీ. కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు.
సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న వ్యాయామ వ్యాయామ ఉపాధ్యాయులు జి మోహన్, కె నరేష్, ఆర్ట్ , క్రాఫ్ట్, ఉపాధ్యాయులు సిహెచ్.రవి కుమార్, బీ త్రివేణి, పద్మావతి, శ్రీకాకుళం గ్రామీణ మండలంలో పాత్రునివలస స్కూల్ కాంప్లెక్స్ లో సి ఆర్ పి గా పనిచేస్తున్న పి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.