33.2 C
Hyderabad
May 4, 2024 00: 07 AM
Slider నల్గొండ

మిషన్ భగీరథ పనుల పట్ల అలసత్వం వహించ వద్దు

#MLADevarakonda

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా  తాగు నీరు అందిస్తున్నట్లు నల్గొండజిల్లా దేవరకొండ నియోజకవర్గం శాసన సభ్యులు రమావత్  రవీంద్ర కుమార్ అన్నారు.

సోమవారం చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ (మాల్)  మీషన్ భగీరథ ద్వార అందిస్తున్న తాగు నీటి నల్లాలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తుందని ఆయన తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో నీటి కరువు తిరనున్నదని పేర్కొన్నారు. ప్రజల కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రకారం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

మిషన్ భగీరథ పనుల పట్ల అలసత్వం వహించ వద్దు అని ఆయన అన్నారు. అన్నీ ట్యంకులు పూర్తి చేసి ప్రతి తండాకు,ప్రతీ అవాసానికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించేలా అధికారులు చూడాలని సూచించారు.

రాష్ట్రంలో రూ.45వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ కంకణాల ప్రావీణా వెంకట్ రెడ్డి,TRS రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,

రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఉజ్జిని విద్యాసాగర్ రావు,సర్పంచ్ కొండూరు శ్రీదేవి శ్రీనివాస్,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,మాస భాస్కర్,బాదేపల్లి పులిరాజు,అక్రమ్,ప్పోషయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రేమించలేదనే కారణంగా యువతిని చంపిన మూర్ఖుడు

Satyam NEWS

దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

Satyam NEWS

యూనివర్సిటీ టాపర్ గా ప్రత్యూష ప్రియదర్శిని….

Satyam NEWS

Leave a Comment