29.7 C
Hyderabad
May 2, 2024 06: 20 AM
Slider ముఖ్యంశాలు

దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

#adilabadcongress

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం వర్తింప చేసేలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దళితులను సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌ను మరోమారు నమ్మవద్దన్నారు. దళిత బస్తీ పథకం కూడా కొంత మందికి మాత్రమే వర్తింపజేస్తారని గుర్తు చేశారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధును ప్రకటించిన సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు దళిత, గిరిజన సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బందు కోసం అన్ని గ్రామాలకు దరఖాస్తు పత్రాలను పంపుతామని, వాటిని కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు దిగంబర్ రావు పాటిల్, నర్సింగ్ రావు, మునిగెల నర్సింగ్,నగేష్,సంజీవ్ రెడ్డి, కౌన్సిలర్ అంబకంటి అశోక్,మల్లేష్ యాదవ్,సాధిక్, చంద్రాల రాహుల్, షకీల్, మోసీన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎటాక్: కాకినాడలో మహిళా జర్నలిస్టుపై దాడి

Satyam NEWS

నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ కి జాతీయ అవార్డు

Satyam NEWS

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం

Bhavani

Leave a Comment