మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. దేవగిరి కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం, సంచలనం నెలకొంది.
ప్రేమ పేరుతో ఈ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని చెబుతున్నారు. నిందితుడు శరన్సిన్హ్ సేథీ సుఖ్ప్రీత్ కౌర్ అలియాస్ కాశిష్ (18)ని వెంబడించి ‘నువ్వు నన్ను ప్రేమించాల్సిందే’ అని వత్తడి తెచ్చాడు. దీనికి ఆ యువతి సమ్మతించలేదు. ఆ యువతి సమాధానం విన్న తర్వాత ఆ యువకుడు ఆమెపై వెనుక నుండి కత్తితో దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు. సేథి తప్పించుకున్న తర్వాత, కౌర్తో ఉన్న మరో అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లిందని పోలీసు అధికారి తెలిపారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
సుఖ్ప్రీత్ కౌర్ దేవగిరి కాలేజీలో మొదటి సంవత్సరం బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) విద్యార్థిని. సేథి కోసం పోలీసులు వెతుకుతున్నారని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.