29.7 C
Hyderabad
April 29, 2024 10: 24 AM
Slider ఆదిలాబాద్

ఏజెన్సీలో విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు

#PoliceAction

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  మావోయిస్టుల బంద్ పిలుపు నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మంచిర్యాల జిల్లాలోని కోట పల్లి వేమనపల్లి అటవీ, మారుమూల ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

 తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో పెద్దఎత్తున‌ కూంబింగ్‌ చేప‌ట్టారు. గోదావ‌రి ప‌రివాహ‌క,మారుమూల ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

వేమన పల్లి కోటపల్లి చెన్నూర్  మండలాలతో పాటు  అంతర్రాష్ట్ర వంతెన వద్ద వాహనాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతాల్లో మావోయిస్టుల క‌ద‌లిక‌లు పెర‌గ‌డంతో పోలీసులు కూబింగ్‌ను ముమ్మ‌రం చేశారు.

 ఈ క్ర‌మంలో ఆసిఫాబాద్,భ‌ద్రాద్రి కొత్తగూండెం జిల్లాల్లో సెప్టెంబ‌ర్ రెండో వారంలో పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.

ఇందులో ఇద్ద‌రు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఎన్‌కౌంటర్ల‌కు నిర‌స‌న‌గా మావోయిస్టుల‌ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

Related posts

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

Satyam NEWS

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఇద్దరు కౌన్సిలర్లు

Satyam NEWS

Leave a Comment