33.2 C
Hyderabad
May 4, 2024 00: 06 AM
Slider నల్గొండ

కరోనా కారణంగా శుభకార్యాలకు ఇక దూరం

MLA Sanampudi Saidireddy

కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనతో కరోనా మహమ్మారి కొంత తగ్గేంత వరకు ప్రభుత్వ ప్రయివేటు శుభకార్యాలు అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

ఇకపై నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కూడా ఎక్కడైనా  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నట్లయితే ఎక్కడి వారు అక్కడే నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. శుభకార్యాలకు జరుపుకునే వారు కూడా మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించుకోవాలి, వైరస్ ఉన్న వారు వచ్చినట్లయితే వారి వద్ద నుండి అందరికీ సోకే ప్రమాదం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు తక్కువ మందితో శుభకార్యాలు నిర్వహించుకునేలా ప్రయత్నం చేయాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప కార్యక్రమాలకి హాజరుకానని ఆయన తెలిపారు.

అనుకోకుండా కార్యక్రమాలకి ఎక్కువ సంఖ్యలో అభిమానులు హాజరు అవుతున్నారని, అందుకోసమే ఇకపై కరోనా మహమ్మారి కొంత తగ్గేంత వరకు దూరంగా ఉండాలి అని ఆలోచన తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా మహమ్మారిని పారద్రోలడంలో బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

Related posts

సింహాచలం భూములు కాజేసేందుకు చైర్మన్ మార్పు

Satyam NEWS

హేట్స్ ఆఫ్: ఇలాంటి కలెక్టర్ ఒక్కడున్నా చాలు

Satyam NEWS

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment