ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన స్టాఫ్ లో క్రమంగా కరోనా వైరస్ సోకడం మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వద్ద గన్ మన్ గా విధులు నిర్వర్తిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. కరోనా సోకిన వెంటనే సురేశ్ పరీక్షలు చేయించుకోలేదని, కరోనా వచ్చిందని ఎవరైనా వివక్ష ప్రదర్శిస్తారేమోనని భయపడ్డాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి సిబ్బందిలో మొత్తం ఎనిమిది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇలాంటి విషయాల్లో వెనుకంజ వేస్తే ప్రాణాలకే ప్రమాదం వస్తుందని కేతిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దయచేసి ఎవరూ కరోనా రోగుల పట్ల వ్యతిరేకభావం ప్రదర్శించవద్దని ఆయన హితవు పలికారు.