జలుబు చేసినా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్న ఈ రోజుల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా బానోత్ హరిప్రియ నాయక్ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు సుఖ ప్రసవం జరిగింది.
ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు మంత్రి పువ్వాడ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే.