గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నేడు జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. నేటి సాయంత్రం జరిగిన ఈ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన -2020 ప్రారంభోత్సవం సభలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి పాల్గొన్నారు. ఆయన తో బాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి మగ్గం నేశారు.
previous post