సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 281 జయంతి సందర్భంగా నిర్మల్ నియోజకవర్గం సారంగపూర్ మండలం దేవి నగర్ తాండా గ్రామంలో లంబాడా ప్రజలు నిర్వహిస్తున్న జయంతి వేడుకలలో శనివారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
మంత్రికి బంజారా మహిళలు వారి సాంప్రదాయం లో స్వాగతం పలికారు నిర్వహించిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంజారా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ వారి ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని తండాల్లో ను సేవాలల్ మహరాజ్ మందిరాల కోసం నిధులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.