బిఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించి దేవరకద్ర నియోజకవర్గాన్ని కాపాడుకుందామని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని బిపిఆర్ గార్డెన్లో బిసి పొలిటికల్ జెఎసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి స్వంత ఆస్తులు పెంచుకోవటం తప్ప నియోకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళలో విద్య, వైద్యంపై కనీస దృష్టి పెట్టలేదని, కానాయపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితుల సమస్యలు గానీ, ఊక చెట్టు వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు, రోడ్ల విస్తరణలు ,మినీ స్టేడియం తదితర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
తెలంగాణలో పదేళ్లుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు తప్ప ప్రజలు ఎవరు బాగుపడలేదని చెప్పారు. కర్వెన ప్రాజెక్టు కాంట్రాక్టు,ఇసుక, మట్టిదందా, భూ కబ్జాలు ఉన్నాయని అయన విమర్శించారు.
జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.రెండు సార్లు గెలిచి అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఏకం అవ్వాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు, తిరుపతయ్య గౌడ్, నగేష్, తోకల రవి, శంకర్, వెంకటేష్, అనుదీప్, సునీల్ , హరి, చెన్నయ్య పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్