29.7 C
Hyderabad
May 2, 2024 07: 02 AM
Slider ముఖ్యంశాలు

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేత

#niranjanreddy

వనపర్తి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి ఎ. సంతోష్ కుమార్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. వనపర్తి పాతకోట 16వ వార్డుకు చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సంతోష్ కుమార్ యాదవ్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆదివారం సంతోష్ కుమార్ యాదవ్ కు నిరంజన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బిజెపిలో చురుకైన పాత్ర పోషిస్తూ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించడంతో గత కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్న సంతోష్ చివరకు కమలంను వీడి కారు ఎక్కారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయనగరంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ ముగింపు

Satyam NEWS

మత మార్పిడులను సహించేది లేదు

Satyam NEWS

టిబి వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment