మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కీర్తించే వ్యక్తిత్వం ఉన్న నేత వాజ్ పేయి అని చంద్రబాబు అన్నారు. వాజ్ పేయితో గడిపిన ప్రతి క్షణం తాను నేర్చుకోవడానికి లభించిన గొప్ప అవకాశం అని చంద్రబాబు అన్నారు.