33.2 C
Hyderabad
May 3, 2024 23: 30 PM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

#Kamareddy Protest

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని టెక్రియల్ బైపాస్ రహదారిపై టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బానుప్రసాద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు చేపడుతున్న ఆందోళనకు మొట్టమొదటగా తెలంగాణ నుంచే మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతుల పట్ల కేంద్రం వివక్షత ప్రదర్శిస్తుందని తెలిపారు. వెంటనే కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

Related posts

 ‘కార్తికేయ 2’కు వినూత్నమైన ప్రచారం….

Satyam NEWS

ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

Satyam NEWS

విలేకరుల మధ్య ఐక్యత లేనందునే కేసులు

Satyam NEWS

Leave a Comment