ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఆయన సతీమణి మాజీ కార్పోరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు గౌడ సామాజిక వర్గంలో బలమైన పట్టున్న రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
previous post