36.2 C
Hyderabad
May 12, 2024 18: 58 PM
Slider రంగారెడ్డి

ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి

#kunasrisailamgowd

రాష్ట్రంలో రైల్వే, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 8న హైదరాబాద్ కి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. ఐడీపీఎల్ చౌరస్తా లోని ఐశ్వర్య కన్వెన్షన్ హల్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ గార్ల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నలుమూలల నుండి  బీజేపీ శ్రేణులు, ప్రజలు విచ్చేసి, జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ, పార్లమెంటు కో కన్వీనర్ డాక్టర్ రాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, బక్క శంకర్ రెడ్డి బావిగడ్డ రవి,  జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, జిల్లా పదాధికారులు, డివిజన్ మున్సిపల్ అధ్యక్షులు, డివిజన్ ఇంచార్జులు, వివిధ మోర్చాల నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి కి ఘనంగా నివాళి

Satyam NEWS

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS

Leave a Comment