ఈ రోజు సిబిఐటి మరియు బెంగళూరు లో ఎక్సెల్ఆర్ సోలుషన్స్ మధ్య సి బి ఐ టి లో చదువుతున్న విద్యార్థులకు అధ్యాపకులకు ఇంటర్న్షిప్లు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కన్సల్టెన్సీని అందించడానికి పరస్పర అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. సిబిఐటి తరపున ప్రోగ్రామ్లను అమలు చేయడానికి ఐటి విభాగ ప్రొఫెసర్ కొలికిపోగు రామకృష్ణ, ఐటి విభాగధిపతి ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు కాంటాక్ట్ పాయింట్గా వ్యవహరిస్తారు.
ఈ ఎంఓయూ మార్పిడి కార్యక్రమానికి డైరెక్టర్ ఐ అండ్ ఐ ప్రొఫెసర్ యు కె చౌదరి, రాకేష్, ఎక్సెల్ఆర్ కన్సల్టెంట్ ఎంఎస్ లీలా రాణి, ఎక్సెల్ఆర్ సొల్యూషన్స్ హెచ్ ఆర్ మేనేజర్ సిరామ్ ప్రత్యూష కావ్య శ్రీ ఇతర సిబ్బంది ఉన్నారు. ఎక్సెల్ఆర్ సిఇఓ శ్రీ రామ్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా ప్రతి విద్యార్థి, అధ్యాపకులు వారి కోడింగ్ మరియు టెక్నికల్ నైపుణ్యాలను పెంచు కోవడటానికి ఎంతో సహాయపడుతుంది అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మరియు ఎక్సెల్ఆర్ హెచ్ఆర్-డైరెక్టర్ శ్యామ్ నారాయణ్ సంతకం చేశారు.