బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి జిహెచ్ఎంసి జంతు సంరక్షణ శాఖ అధికారులు సద్గుణ రెడ్డి, వనజతో కలిసి జిహెచ్ఎంసి వారు ఏర్పాటుచేసిన నీళ్ల తొట్టిలలో నీళ్లను పోయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రమైన ఎండలకు జంతువులకు,పక్షులకు దాహాన్ని తీర్చడానికి జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేస్తున్న నీళ్ల తొట్టిలను అన్ని బస్తీలు, కాలనీలలో అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానిక ప్రజలు వాటిల్లో నీళ్లు పోసే విధంగా చూడాలని అన్నారు. ఎండల తీవ్రతకు నోరులేని జీవాలైనా జంతువులు, పక్షులకు దాహార్తి తీర్చడంలో ప్రజలు ముందుండి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మిర్యాల శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట్
previous post