27.7 C
Hyderabad
May 7, 2024 08: 20 AM
Slider విశాఖపట్నం

బరితెగించిన వైసీపీ నాయకులు: పోలీస్ ల పై బూతు పురాణం

#ycpleaders

మద్యం మత్తులో ఉన్న వైసీపీ నాయకులు పోలీస్ లపై అసభ్య పదజాలం తో దురుసు ప్రవర్తన చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులనే ‘‘రా చూసుకుందాం’’ అంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఏం చేయాలో అర్ధం కాని పోలీసులు చూస్తూ ఉరుకుండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం పాకలపాడు ఎంపిటిసి యాళ్ళ లక్ష్మీ దుర్గ భర్త సన్యాసి నాయుడు ఈ విధంగా బరితెగించినట్లు వీడియోలో స్పష్టం అవుతున్నది. అతనితో బాటు మరి కొందరు మాకవరపాలెం లో ఒక దాబా లో ఫుల్ గా మద్యం సేవించి అక్కడి వారితో గొడవ కు దిగారు.

దీనితో అక్కడి వారు పోలీస్ లకు సమాచారం ఇవ్వడం తో వారు వచ్చి అడగగా పోలీస్ లతో వైసీపీ నాయకులు బూతులతో దురుసు ప్రవర్తన కు పాల్పడ్డారు. మేం ఎమ్మెల్యే మనుషులం మమ్మల్నే ప్రశ్నిస్తావా నువ్వంత నీ బతుకెంత అంటూ నానా దుర్భాషలాడారు.

Related posts

మానవాళికి మరో ముప్పు.. మళ్ళీ బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి..

Sub Editor

RTI ఫోరం ములుగు జిల్లా ఉపాధ్యక్షునిగా బోడ రాజు

Satyam NEWS

జీవో ట్రిక్స్: బాసూ మీ ఆదేశాలు సూపర్ బాసూ

Satyam NEWS

Leave a Comment