మద్యం మత్తులో ఉన్న వైసీపీ నాయకులు పోలీస్ లపై అసభ్య పదజాలం తో దురుసు ప్రవర్తన చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులనే ‘‘రా చూసుకుందాం’’ అంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఏం చేయాలో అర్ధం కాని పోలీసులు చూస్తూ ఉరుకుండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం పాకలపాడు ఎంపిటిసి యాళ్ళ లక్ష్మీ దుర్గ భర్త సన్యాసి నాయుడు ఈ విధంగా బరితెగించినట్లు వీడియోలో స్పష్టం అవుతున్నది. అతనితో బాటు మరి కొందరు మాకవరపాలెం లో ఒక దాబా లో ఫుల్ గా మద్యం సేవించి అక్కడి వారితో గొడవ కు దిగారు.
దీనితో అక్కడి వారు పోలీస్ లకు సమాచారం ఇవ్వడం తో వారు వచ్చి అడగగా పోలీస్ లతో వైసీపీ నాయకులు బూతులతో దురుసు ప్రవర్తన కు పాల్పడ్డారు. మేం ఎమ్మెల్యే మనుషులం మమ్మల్నే ప్రశ్నిస్తావా నువ్వంత నీ బతుకెంత అంటూ నానా దుర్భాషలాడారు.