29.7 C
Hyderabad
May 6, 2024 03: 45 AM
Slider ముఖ్యంశాలు

రాజ్యాంగం జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్

#mrps

మంద కృష్ణ మాదిగ తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ దేశాలలోనే అత్యున్నత మైన భారత రాజ్యాంగం కల్పించిన పదవులను అనుభవిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని సి యం కెసిఆర్ అనటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని,రాజ్యాగం జోలికి వస్తే ఎంతటి వారికైనా తగిన బుద్ది చెపుతామని, ఇకనైనా ఎంతో గొప్ప చరిత్ర ఉన్న రాజ్యాంగం పట్ల తన వ్యవహార శైలి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు,మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, మాజీ ఎంపిటిసి చింతిర్యాల నాగయ్య, కస్తాల ముత్తయ్య,మంద వెంకటేశ్వర్లు, యడవల్లి వీరబాబు,కస్తాల సైదులు, మేళ్లచెర్వు సత్యం సైదులు,పిట్ట మట్టయ్య,మీసాల వెంకటేశ్వర్లు,మేరిగ రవి,కొమ్ము పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Satyam NEWS

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు

Satyam NEWS

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

Leave a Comment