మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో బెంబేలెత్తిన పాతబస్తీ ముస్లింలు వైద్య పరీక్షలకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ఈ చైతన్యం కోసమే నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తో బాటు పలువురు పలు సూచనలు చేస్తున్నారు.
మల్లేపల్లి బడీ మసీదు ప్రాంతం నుంచి ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ కు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు సదస్సులో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
హైదరాబాద్ కు వారు తిరిగి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి. దాంతో వీరికి భయం పట్టుకున్నది. అందరూ బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు.