ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తూ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం అమరావతి నుండి ప్రారంభించిన శుభ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి, సిద్ధవటం మండలం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ మేడా మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా సిద్ధవటం మండలం ఎంపీడీవో కార్యాలయంలోని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏ కుల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలు లో భాగంగా అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం ముఖ్యమంత్రి లక్ష్యమని అలాగే ప్రతి పేద బలహీన వర్గాలకు నవరత్నాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జవహర్ భాష వైయస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.