31.7 C
Hyderabad
May 2, 2024 10: 12 AM
Slider కడప

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు

#kadapa

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తూ రెండో విడత  చెక్కులు పంపిణీ  కార్యక్రమం అమరావతి నుండి ప్రారంభించిన శుభ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి, సిద్ధవటం మండలం వైఎస్ఆర్సిపి  ఇంచార్జ్ మేడా మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు  కడప జిల్లా సిద్ధవటం మండలం ఎంపీడీవో కార్యాలయంలోని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏ కుల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలు లో భాగంగా అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం ముఖ్యమంత్రి లక్ష్యమని అలాగే ప్రతి పేద బలహీన వర్గాలకు నవరత్నాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని  ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జవహర్ భాష వైయస్సార్ సిపి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారీ నష్టపరిహారాన్ని ఆఫర్ చేసిన జాన్సన్ & జాన్సన్

Bhavani

కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి చౌరాసియా పై దాడి

Satyam NEWS

జీఓ 4 ప్రకారం జీతాలు చెల్లించాలి

Murali Krishna

Leave a Comment