ఏపీలో 13 జిల్లా లకు తోడు కొత్తగా మరో 11 జిల్లా లు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే రెవెన్యూశాఖ తో పాటు పోలీసు శాఖ కూడా కసరత్తు ప్రారంభించింది.దీంతో విజయనగరం జిల్లాలో కొత్త మూడు పోలీసు స్టేషన్ లు విభజన విజయనగరం జిల్లాలో కలిసింది.
దీంతో రాజాం ,సంతకవిడి,వంగర పీఎస్ లను విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా అకస్మాత్తుగా తనిఖీ చేసారు. జిల్లా పోలీసుశాఖ పరిధిలోని నూతనంగా కలిసిన రాజాం, సంతకవిటి, వంగర పోలీసు స్టేషన్లను ఎస్పీ ఎం.దీపిక సందర్శించి, రికార్డులను పరిశీలించి, స్టేషను పరిదిలోగల శాంతి భద్రతల సమస్యలను అధికారులను అడిగి తెలుసుకొని, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి, త్వరితగతిన నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.