తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఆయన సతీమణి సుధారాణి ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగాజ్యోతి దంపతులను సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు బడే నాగజ్యోతి దంపతులను ఆశీర్వదించి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ములుగు జిల్లా గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లాను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. గతంలో చెయ్యని విధంగా సీఎం కేసీఆర్ కృషితో ములుగు జిల్లాలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నారు.