ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో 14 మెంబర్స్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 14 మెంబర్స్ నుండి చైర్మన్ వైస్ చైర్మన్ కోశాధికారి రాష్ట్ర పాలక సభ్యులను ఎన్నుకున్నారు. చైర్మన్ గా డాక్టర్ అల్లం అప్పయ్య డిఎంహెచ్ఓ ని ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా గంగిశెట్టి శ్రీనివాస్, కోశాధికారిగా శిరూప సతీష్, రాష్ట్ర పాలకమండలి సభ్యునిగా కొత్తపల్లి ప్రసాద్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్లుగా కనతల నాగేశ్వరరావు, కొట్టే రాజిరెడ్డి, చుంచు రమేష్, కళ్లబోయిన సురేష్, కోకిల సారయ్య, పసుపులేటి సతీష్, గూడూరు మహిపాల్, చిలుకూరి సతీష్, ముసుగు గోవర్ధన్, బండి ఈశ్వరులు ఎన్నికయ్యారు. గౌరవ అడ్వైజర్ గా ఈవి శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యుల చేత గౌరవ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు.
previous post
next post