ములుగు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై నేడు హైదరాబాద్ లోని ప్రగతి భవనంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ములుగు జిల్లా ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆయన వివరించారు. ములుగు జిల్లా అభివృద్ధి ప్రత్యేక సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎంకు జడ్పీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.