డాక్టరేట్ పొందిన సర్దార్ పుటం పురుషోత్తం రావును అంబర్ పేట్ మున్నూరు కాపు నేతలు సన్మానించారు. గజ్వేల్ నియోజకవర్గం నియోజకవర్గం వంటిమామిడి గ్రామంలో నేడు జరిగిన తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
అదే విధంగా రాష్ట్ర కోశాధికారి ఈసంపల్లి వెంకన్నను కూడా సన్మానించారు. మున్నూరు కాపు మహాసభ అంబర్పేట్ నియోజకవర్గ నేతలు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కార్యదర్శి వుప్పు సత్యనారాయణ, హైదరాబాద్ శాఖ ఉపాధ్యక్షులు రాగుల ప్రవీణ్ పటేల్, నగర శాఖ ప్రధాన కార్యదర్శి పోల్నేనీ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మహా సభ సెక్రటరీ జనరల్ మంగళవారపు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి పర్వత సతీష్ కుమార్, మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు మామిళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.