వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ని నేతాజీ చౌక్ లో మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఈ రోజు లక్షల మంది పేదలకు గుండె కు సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుందంటే అది కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి చలవే అని పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య కోసం ఫీజ్ రియంబర్స్మెంట్, మైనారిటీ లకు 4% రిజర్వేషన్, 108 ఎమర్జెన్సీ సేవలు లాంటి పథకాలు నేటికీ అమలవుతున్నాయి ఉంటే కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లే అని తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లా లో రిమ్స్ ఆస్పత్రి రావడానికి కారణం కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. దేశమే గర్వించదగ్గ ముఖ్యమంత్రి గా ఆయన పేరు తెచ్చుకున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుడిపెల్లి నగేష్, షకీల్, కలీమ్, మోసిన్ పటేల్, మల్లేష్ యాదవ్, చంద్రాల రాహుల్, షిండే, అజీజ్, నుస్రత్ ఖాన్, అన్నుభాయ్, మహతాఫ్ ఖాన్, అఖీల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.