29.7 C
Hyderabad
May 4, 2024 06: 17 AM
Slider గుంటూరు

వారసత్వ పొలం కోసం దారుణంగా నరికి చంపారు

#TenaliMurder

పొలం వివాదం కారణంగా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం  లో  చోటుచేసుకుంది.

ఆదివారం ఉదయం పొలాల్లోకి బహిర్భూమికి వచ్చిన చందు కృష్ణమూర్తి అనే వ్యక్తిని మృతుని సోదరుడు చందు మురళి కృష్ణ, అతని కుమారులు అత్యంత దారుణంగా నరికి హతమార్చారు.

గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చిన పొలం విషయంలో వీరి ఇరువురి కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది.

ఈ వివాదంలో గ్రామంలోనే పెద్దమనుషులు పోలీసుల సహాయంతో వివాదాన్ని పరిష్కరించాలని చూసినప్పటికీ సర్దుబాటు కాలేదు.

దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. చివరకు చందు కృష్ణమూర్తి హత్యకు దారి చేసింది.

హత్య జరిగిన విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Related posts

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి

Satyam NEWS

మహానీయుల త్యాగాలు మరువలేనివి

Satyam NEWS

భారతీయ కుటుంబ వ్యవస్థలో శ్రీరాముడు అంతర్భాగం

Bhavani

Leave a Comment