పొలం వివాదం కారణంగా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం లో చోటుచేసుకుంది.
ఆదివారం ఉదయం పొలాల్లోకి బహిర్భూమికి వచ్చిన చందు కృష్ణమూర్తి అనే వ్యక్తిని మృతుని సోదరుడు చందు మురళి కృష్ణ, అతని కుమారులు అత్యంత దారుణంగా నరికి హతమార్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చిన పొలం విషయంలో వీరి ఇరువురి కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది.
ఈ వివాదంలో గ్రామంలోనే పెద్దమనుషులు పోలీసుల సహాయంతో వివాదాన్ని పరిష్కరించాలని చూసినప్పటికీ సర్దుబాటు కాలేదు.
దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. చివరకు చందు కృష్ణమూర్తి హత్యకు దారి చేసింది.
హత్య జరిగిన విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు