38.2 C
Hyderabad
May 3, 2024 19: 59 PM
Slider నల్గొండ

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నెలవై ఉన్నముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఇక్కడ నిర్వహించినట్లు తెలంగాణాలోనే మరెక్కడా ముత్యాలమ్మ జాతర పండుగను నిర్వహించరని ప్రతీతి.

ఈ పండుగకు ప్రతి సంవత్సరం ఆడపడుచులు, కొత్త కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, వచ్చి పాల్గొని చల్లని తల్లి ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొంటూ ఉంటారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పండుగను మూడు రోజులు నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరిని చల్లగా కంటికి రెప్పలా కాపాడే ఆ తల్లి కరుణ ప్రజలందరిపై ఉండాలని, ఆ తల్లి దయతో కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని, రైతులు ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని తాను పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

అనంతరం పద్మావతి రెడ్డి మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియచేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మావతి రెడ్డి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,జక్కుల మల్లయ్య, కస్తాల శ్రవణ్ కుమార్, ములకలపల్లి రామగోపి, సైదా మేస్త్రి, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్‌ కేసులు

Sub Editor

పేదల కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన కాచిగూడా కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment