డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 37 వ వర్ధంతి , శ్యాం ప్రసాద్ ముఖర్జీ 122 వ జయంతి వేడుకలను ప్రజా తెలంగాణ న్యూస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా తెలంగాణ న్యూస్ సీఈఓ ఎండి సద్దాం హుస్సేన్ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేష్ మాదిగ , మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకటరమణ , అంబర్పేట్ నియోజకవర్గ దళిత నాయకురాలు లావణ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగాలు మరువలేనివని యువత అదే బాటలో నడవాలని ఆకాంక్షించారు.
సత్యం న్యూస్, అంబర్పేట్