మద్యం మత్తులో కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ లో ఒకరు మృతి చెందారు. తిరుపతి రూరల్ పరిధిలోని, వేదాంతపురం పంచాయతీ, రామచంద్రాపురం కాలనీలోని వెల్డింగ్ షాపు లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తి తిరుపతి పద్మావతి పురం కు చెందిన సురేష్(35 )గా పోలీసులు గుర్తించారు.
తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా,రాజీవ్ నగర్ ,కు చెందిన నటరాజన్ , పద్మావతి పురం కు చెందిన సురేష్ లు ఇరువురు వెల్డింగ్ షాపు యజమాని ఉమాపతి దగ్గర పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆదివారం తెల్లవారు జామున మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో నటరాజన్ చేతిలో సురేష్ మృతి చెందాడు.
తలపై రాడ్ తో కొట్టి హత్యకు పాల్పడిన నిందితుడు తల పగిలి, తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ఆదివారం ఉదయం షాపు యజమాని ఉమాపతి, హత్యకు పాల్పడిన నటరాజన్ ను పట్టుకొని ,తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా కు తరలించారు. కేసు నమోదు చేసి తిరుచానూరు సి ఐ.సుధాకర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.