సహజీవనం చేసినంత కాలం బాగానే ఉన్నాడు. ఇంత కాలం నుంచి సహజీవనం చేస్తున్నాం కదా ఇక పెళ్లి చేసుకుందామా అని అడిగే సరికి చంపేశాడు. కడప జిల్లా రాజంపేట పట్టణం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన బిళ్ళ సంపూర్ణ కు కడప జిల్లా ఒంటిమిట్ట కు చెందిన లక్ష్మీ నరసయ్య తో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
2009లో భర్త మృతి చెందాడు. అనంతరం ఆమె రాజంపేట లోని హుస్సేన్ బాషా తో సహజీవనం చేసింది. అతనికి తో తెగతెంపులు చేసుకొని, వేంపల్లి కు చెందిన సాంబశివతో సహజీవనం చేసింది. ఈ నేపధ్యంలో 5 ఎకరాల పొలం ను అతని పేర రాసింది. పెళ్లి చేసు కుంటానని చెప్పి ఎన్ని రోజులైనా చేసుకోక పోవడంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. పెళ్లి చేసుకోక పోతే పోలీసు కేసు పెడతానని, పెద్దల పంచాయతీ పెడతానని సంపూర్ణ బెదిరించింది.
గత నెల 20 న బైక్ పై వడ్డీ డబ్బుల వసూలు కోసం సంపూర్ణ, సాంబాలు రాజంపేట కు వచ్చారు. ఈ మేరకు రాజంపేటలో ని సంపూర్ణ తన చెల్లికి కూడా ఫోన్ చేసి తాము వస్తున్నట్టు తెలిపింది. కాగా రాజంపేట లోని తిరుపతి-కడప రోడ్డు లోని ఓ డాబా వెనుక సాంబా సంపూర్ణ ను గత నెల 21న రాయితో తలపై కొట్టి హతమార్చి బంగారు గొలుసు, కొంత నగదు తీసుకుని పరారీ అయ్యాడు.
పోలీసులు కేసు విచారణ చేసి సాంబాను అదుపులోకి తీసుకున్నారు. నేడు పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఈ వివరాలను తెలిపారు. అర్బన్ సి.ఐ.శుభకుమార్ తదితరులు పాల్గొన్నారు.