27.7 C
Hyderabad
May 4, 2024 09: 11 AM
Slider ఆదిలాబాద్

మంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య

#Manchyryala Government Hospital

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి హత్యకు గురయ్యాడు. సామాన్లు భద్రపర్చుకునే అల్మరా విషయంలో జరిగిన గొడవ కారణంగా… తన పక్క బెడ్‌పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేశాడు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య (50) హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.

మహారాష్ట్రకు చెందిన సుధాకర్‌ అనే వలస కూలీ ఫిట్స్‌ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. దేవయ్య, సుధాకర్‌ పక్కపక్క బెడ్లపై ఉండి చికిత్స పొందుతున్నారు. సామాన్లు భద్రపరుచుకునే అల్మారా విషయంలో వారిద్దరి మధ్య రాత్రి గొడవ జరిగిందని సమాచారం.

ఆ తర్వాత అందరూ నిద్రిస్తుండగా సుధాకర్‌ పండ్లు కొసే కత్తితో దేవయ్య ఛాతీపై పొడిచాడు. దీనిని గమనించిన దేవయ్య భార్య కేకలు వేయగా సుధాకర్‌ పారిపోయాడు. కత్తిపోటుకు గురైన దేవయ్యకు ఆస్పత్రి సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆపై, మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవయ్య మృతి చెందారు…

Related posts

ఆళ్లగడ్డలో బిజెపి నేతపై వైసీపీ నేతల హత్యాయత్నం

Satyam NEWS

కొత్త జిల్లాల ఏర్పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా?

Satyam NEWS

ప్రతి ఇంట్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

Satyam NEWS

Leave a Comment