26.7 C
Hyderabad
May 3, 2024 09: 00 AM
Slider ముఖ్యంశాలు

తీసుకున్న అప్పు ఇవ్వమంటే హత్య చేశారు

#ashok

అప్పు ఇచ్చిన వ్యక్తి.. ఆ డబ్బు తిరిగి అడుగుతున్నాడనే కక్షతో అతడిని పాశవికంగా హత్య చేయించిన దారుణమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో  ఈ ఘటన చోటుచేసుకుంది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌ పంచాయతీలోని శాంతినగర్‌కు చెందిన భాజపా మండల అధ్యక్షుడు ధారావత్‌ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్‌ అశోక్‌కుమార్‌ (24) ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చెందిన గుగులోత్‌ ప్రేమ్‌కుమార్‌కు అవసరమైనప్పుడు అశోక్‌ అప్పు ఇచ్చేవాడు. అలా ప్రేమ్‌కుమార్‌ రూ.80 వేల వరకు బాకీ ఉన్నట్లు తెలిసింది. అతడి మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్‌ అప్పు ఇచ్చినట్లు సమాచారం. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్‌ ఇద్దరినీ అడుగుతుండటంతో వారు కక్ష పెంచుకున్నట్లు సమాచారం. డబ్బులిస్తానని ప్రేమ్‌కుమార్‌ చెప్పడంతో అశోక్‌ తన ద్విచక్ర వాహనంపై ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చేరుకున్నాడు. నిందితులు పథకం ప్రకారం అశోక్‌ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి గొంతు, చేతిమణికట్లు, కాలి చీలమండల నరాలు కోసి పాశవికంగా హత్య చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related posts

పండు వయసులో పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తారా?

Satyam NEWS

తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

వేగంగా భారీ దొంగతనం కేసును చేదించిన పోలీసులు

Bhavani

Leave a Comment