38.2 C
Hyderabad
April 28, 2024 19: 43 PM
Slider ముఖ్యంశాలు

శబరిమలకు పోటెత్తిన భక్తులు

#shabarimala

శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది.  సుమారు లక్ష మంది అయ్యప్పనుఒక్కరోజే దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా క్యూలైన్‌ మళ్లీ అలానే కనిపిస్తుండటం శబరిమలలో భక్తుల రద్దీకి నిదర్శనంగా కనబడుతోంది. ఒక్కరోజే లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, దర్శనం కోసం 1.10 లక్షల మంది భక్తులు దర్శనానికి ఎదురుచూస్తున్నారు. పంబ నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. కాగా అయ్యప్ప మండల దీక్షల నేపథ్యంలో చాలామంది దీక్షలు విరమిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు రావటంతో , అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నదానం, మంచి నీటి సౌకర్యాలతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related posts

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు లో ప్రభుత్వ నిర్లక్ష్యం

Satyam NEWS

ప్రజా రవాణా శాఖ కు ఆర్టీసీ సిబ్బంది

Satyam NEWS

బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Bhavani

Leave a Comment