29.7 C
Hyderabad
May 4, 2024 03: 58 AM
Slider సినిమా

ప్రభాస్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా ముషిణి విక్రమ్

#rajasab

పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నిర్మిస్తున్న చిత్రం రాజాసాబ్ సినిమాకు కోనసీమవాసి అమలాపురానికి చెందిన ముషిణి విక్రమ్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉండడం అత్యంత సంతోషదాయకం అని అమలాపురంలో పలువురు ప్రముఖులు తమ హర్షాన్ని వెలిబుచ్చారు. గతంలో భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, మహానుభావుడు వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మితమౌతున్నది. ప్రముఖ హైకోర్టు న్యాయవాది ముషిణి రామకృష్ణారావు తనయుడు ముషిణి విక్రమ్ అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించడం అత్యంత ముదావహం.

సంక్రాంతి సందర్భంగా రాజాసాబ్ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేసిన సందర్భంగా తన సొంత ఊరికి విచ్చేసిన ముషిణి విక్రమ్ ను ఆయన స్వగృహంలో పట్టణ ప్రముఖులు , రాయుడు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర కళాశాల అధినేత యూత్ జె.ఎ . సి  అధ్యక్షులు కరాటం ప్రవీణ్ ముషిణి విక్రమ్ ను పండిత శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముషిణి విక్రమ్ తొలి నుండి చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకునిగా ఎంతో పేరు గడించిన ప్రముఖ దర్శకులు మారుతి సినిమాలు శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజూ పండగే, మంచిరోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేయడం సంతోషదాయకం అన్నారు.

ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ , మాజి హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్ . బాలయోగి అమలాపురం మాజి పార్లమెంట్ సభ్యుల ఎ. జె వి . బుచ్చి మహేశ్వరరావు ప్రవాస భారతీయులు సి హెచ్. త్రినాధరావు కూచిభొట్ల ఆనంద్ తదితరులు ముషిణి విక్రమ్ భవిష్యత్తులో చలన చిత్రరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తనను ఆశీర్వదించిన వారందరికి దర్శకులు ముషిణి విక్రమ్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

బి ఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీ కన్న తల్లితో సమానం

Satyam NEWS

ఆర్ కృష్ణయ్యకు విన్నపం ఒక పోరాటం వినతి పత్రం

Satyam NEWS

మంత్రి సీతక్క కు ములుగులో  ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment